కుల్గాంలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

17 Jul, 2020 08:43 IST|Sakshi

కశ్మీర్‌: కుల్గాంలోని నాగ్‌నధ్‌-చిమ్మర్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌ పోలీసులతో పాటు, 9 మంది పీఆర్‌, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నాగ్‌నద్‌-చిమ్మర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు ఆయన వెల్లడించారు. భద్రతా బలగాలు అక్కడకు చేరుకోగానే నక్కి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో పోలీసులు, జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.

చదవండి: కశ్మీర్‌లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్‌

మరిన్ని వార్తలు