కశ్మీర్‌లో ఉగ్రదాడి : ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి

12 Jun, 2019 18:11 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలపై బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించగా,పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. గాయపడిన వారిలో జమ్ము కశ్మీర్‌కు చెందిన ఓ ఎస్‌హెచ్‌ఓ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌, స్ధానిక మహిళ ఒకరు ఉన్నారని అధికారులు తెలిపారు.

దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ పట్టణం కేపీ రోడ్‌లో సీఆర్‌పీఎఫ్‌ బృందంపై ఉగ్రదాడి జరిగిందని వారు వెల్లడించారు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు