హైదరాబాద్‌ నుంచి తీవ్రవాదుల తరలింపు

2 Feb, 2017 19:32 IST|Sakshi
హైదరాబాద్‌ నుంచి తీవ్రవాదుల తరలింపు

హైదరాబాద్‌:
దిల్‌షుక్‌నగర్‌ పేలుళ్ల నిందితులను ఢిల్లీ, ముంబై జైళ్లకు తరలించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌తో పాటు మరో ఇద్దరిని తీహార్‌ జైలుకు, మిగతా ఇద్దరు ఉగ్రవాదులను ముంబైకి గురువారం విమానంలో తరలించినట్టు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

యాసిన్‌ భత్కల్‌తో పాటు ఇద్దరిని ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు, ముంబై తరలించిన ఇద్దరినీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ బృందాలు ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు