భారత ఎంబసీ వద్ద బాంబు పేలుడు

6 Jan, 2016 02:26 IST|Sakshi

జలాలాబాద్: అప్గానిస్తాన్‌లో భారతీయ సంస్థలపై ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జలాలాబాద్ నగరంలో ఉన్న భారత దౌత్య కార్యాలయం సమీపంలో మంగళవారం బాంబు పేలింది. కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్లు భారత దౌత్యాధికారి ఒకరు తెలిపారు. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని అప్గాన్ అధికారులు తెలిపారు. భారత కాన్సులేట్ సమీపంలోనే పాక్, ఇరాన్ దౌత్య కార్యాలయాలు ఉన్నాయని విదేశాంగ ప్రతినిధి వికాశ్ స్వరూప్ అన్నారు. దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ఇంతవరకు ప్రకటన చేయలేదు.

>
మరిన్ని వార్తలు