'కాంగ్రెస్ తీవ్రవాదులతో చేతులు కలిపింది'

21 Nov, 2015 13:53 IST|Sakshi

కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులతో చేతులు కలిపిందని పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. రాష్ట్ర శాంతి భద్రతలపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచు పడ్డారు. పంజాబ్ లో అశాంతికి కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. జాతి వ్యతిరేక శక్తులకు ఆ పార్టీ నిధులు ఇస్తూ.. ప్రోత్సహిస్తోందని అన్నారు.



 

మరిన్ని వార్తలు