కశ్మీర్ లేనిదే భారత్‌తో చర్చలు లేవు: పాక్

14 Jan, 2015 00:41 IST|Sakshi

ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్ అంశం ఎజెండాలో భాగంగా లేనిదే భారత్‌తో తాము ఎలాంటి చర్చలూ ప్రారంభించబోమని పాకిస్తాన్ స్పష్టంచేసింది. గత ఏడాది కశ్మీర్ నేతలతో చర్చలకు నిర్ణయించిన సమావేశాన్ని రద్దుచేయటం ద్వారా ఈ అంశంపై చర్చించేందుకు భారత్ సుముఖంగా లేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్‌అజీజ్ వ్యాఖ్యానించారు.

రెండు దేశాలూ చారిత్రక అపనమ్మకాన్ని అధిగమించి శాంతి చర్చలు జరపాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ ఇరు దేశాలకూ సూచించగా అజీజ్ పైవిధంగా స్పందించారు. ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలూ ముందుకు వచ్చి చర్చలు జరపడాన్ని తా ము ప్రోత్సహిస్తామని కెర్రీ పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు