ట్రక్కును ఢీకొట్టిన జీపు: ముగ్గురి మృతి

27 Apr, 2016 17:24 IST|Sakshi

సోనెభద్ర(ఉత్తరప్రదేశ్): జీపు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా,  10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన వారణాసి-శక్తినగర్ రోడ్డుపై బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పెళ్లికి వెళ్లిన 13 మంది జీపులో తిరిగి వస్తుండగా నిర్మాణంలో ఉన్న ఫైఓవర్ వద్ద ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు