ముగ్గురు తీవ్రవాదుల ఎన్ కౌంటర్

23 Aug, 2015 09:27 IST|Sakshi

శ్రీనగర్: ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. ఈ సంఘటన జమ్మూ - కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల ద్వారా కుప్వారాకు 100 కిలో మీటర్ల దూరంలో మిలిటెంట్లు ఉన్నట్టు తెలుసుకున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి కూడా గాయపడ్డాడని అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు