నేటి ముఖ్యాంశాలు

25 Jul, 2017 10:23 IST|Sakshi

ప్రమాణస్వీకారం
భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ కోవింద్‌తో పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

డ్రగ్స్‌ కేసు
నేడు ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను సిట్‌ విచారించనుంది.

ఛార్మీ పిటిషన్‌ విచారణ
బలవంతంగా రక్ష నమూనాలు సేకరించొద్దంటూ డ్రగ్స్‌ కేసులో విచారణపై నటి ఛార్మీ దాఖలు చేసిన పిటిషన్‌ నేడు విచారణకు రానుంది.

కుంభకోణం
నేడు మియాపూర్‌ భూ కుంభకోణంపై హైకోర్టులో కేసు విచారణకు రానుంది. కుంభకోణంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ బీజేపీ నేత రఘునాథరావు కోర్టును ఆశ్రయించారు.

కేసీఆర్‌ ఢిల్లీ పయనం
నేడు రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సమయంలో మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అవుతారు.

మరిన్ని వార్తలు