బీజేపీ అగ్రనేతల సమావేశం

18 Feb, 2014 09:57 IST|Sakshi

న్యూఢిల్లీ : రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణల సిద్ధం చేసిన బీజేపీ అగ్రనేతలు మంగళవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ, సీమాంధ్ర నుంచి అందిన సవరణల ప్రతిపాదనల్ని క్రోడికరించి వాటి నుంచి 9 సవరణల్ని బిల్లులో చేర్చేందుకు బీజేపీ సిద్ధం చేసింది. నేడు తెలంగాణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే.  దాంతో సభ కార్యక్రమాలు సజావుగా జరిగితేనే తెలంగాణ బిల్లుపై చర్చకు అనుమతి ఇవ్వాలని బీజేపీ కోరనుంది.

మరిన్ని వార్తలు