ఆధార్‌’తో నా సమాచారం బయటికి రాలేదు: ఆర్‌ఎస్‌ శర్మ 

9 Aug, 2018 04:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఆధార్‌ చాలెంజ్‌’తో తనకు సంబంధించిన సమాచారమేదీ బహిర్గతం కాలేదని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ తెలిపారు. కీలకమైన విధానపర నిర్ణయాలను చర్చించేందుకు సోషల్‌ మీడియా తగిన వేదిక కాదని పేర్కొన్నారు. తన వివరాలు బయటపెట్టాలని సవాలు విసురుతూ శర్మ ఆధార్‌ సంఖ్యను వెల్లడించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఈ మెయిల్‌ సమాచారాన్ని సంపాదించినట్లు కొందరు నెటిజెన్లు ప్రకటించగా, అలాంటిదేం లేదని శర్మ కొట్టిపారేశారు. ట్రాయ్‌ చైర్మన్‌గా నేడు పదవీ విరమణ పొందనున్న శర్మ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆధార్‌ వల్ల నా వ్యక్తిగత సమాచారమేదీ బయటికి రాలేదు. వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్‌ లేకుండానే తెలుసుకోవచ్చు. ఆధార్‌ సవాలును నేనే విసిరినట్లు భావిస్తున్నారు. అది నిజం కాదు. ఒకరు విసిరిన సవాలుకు స్పందించానంతే’అని అన్నారు.   

>
మరిన్ని వార్తలు