వేగంగా వచ్చి రైలు ఢీ.. ఏనుగులు మృత్యువాత

12 Dec, 2016 14:52 IST|Sakshi
వేగంగా వచ్చి రైలు ఢీ.. ఏనుగులు మృత్యువాత

దిస్పూర్‌: అసోంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ రైలు మూడు ఏనుగులను ఢీకొట్టింది. దీంతో అవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఆ ఏనుగుల్లో రెండు గర్భంతో ఉన్నాయి. అటవీ శాఖ అధికారుల వివరణ ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత పట్టాలు దాటుతున్న ఈ ఏనుగులను కన్యాకుమారి-దిబ్రూగఢ్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది.

దీంతో అవి చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఏనుగుల్లో ఒకటి నాలుగేళ్ల నాటిదని, మరో రెండు ఏనుగులు గర్భంతో ఉన్నాయని చెప్పారు. పోస్టు మార్టం చేసి రెండు నెలల, నాలుగు నెలల పిండాలను తొలగించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో రైలు చాలా వేగంతో ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
 

మరిన్ని వార్తలు