బోగీలను వదిలి,.. రైలు పరుగు

10 Aug, 2014 02:18 IST|Sakshi
బోగీలను వదిలి,.. రైలు పరుగు

బెంగళూరు: మైసూరు, బెంగళూరుకు మధ్య ప్రయాణిస్తున్న రైలులో ఇంజిన్‌నుంచి కొన్ని బోగీలు వేరుపడి కొద్ది సేపు రైలు పరుగులు పెట్టింది. శనివారం ఉదయం ఏడున్నరకు 13 బోగీలతో దర్బాంగ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఎనిమిదిన్నరకు మండ్య సమీపంలో తొమ్మిదో బోగీ బేరింగ్ విరగడంతో ఆ బోగీ  విడిపోయింది.

కొద్దిసేపటికి మరో నాలుగు బోగీలు విడిపోయి, మొత్తం అయిదు బోగీలకు రైలుతో లింక్ పోయింది. చాలా సేపటికి పరిస్థితిని గమనించిన డ్రైవర్, రైలును తిరిగి మండ్యకు మళ్లించారు. తొమ్మిదో బోగీ మినహా మిగిలిన బోగీలను రైలుకు తగిలించాక రైలు బెంగళూరు బయలుదేరింది.
 

మరిన్ని వార్తలు