మహిళా బిల్లుకు మద్ధతిస్తాం: బూర నర్సయ్య గౌడ్

8 Mar, 2016 16:30 IST|Sakshi

ఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ తమ మద్ధతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్ధతిస్తుందని ఆ పార్టీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. అయితే మహిళా బిల్లులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల మహిళలకు స్థానం దక్కాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ తమ ప్రతిపాదనను వెల్లడించినట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు