జైపూర్: భారీ వర్షాలతో రాజస్తాన్ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా వాగులు, చెరువులు పొంగిపోతున్నాయి. రాజస్తాన్లో భారీ వర్షాలకు వరద నీటిలో ఓ ట్రక్కు కొట్టకుకుపోయింది. ఆ సమయంలో ట్రక్కులో 12మంది స్కూలు చిన్నారులు ఉన్నారు. వరద ఉధృతికి ట్రక్కు కొట్టుకుపోతుండగా... స్థానికులు తాళ్లసాయంతో దానిని ఒడ్డుకు చేర్చారు. విద్యార్థులను కాపాడారు. రాజస్తాన్లోని దుంగర్పూర్లో ఈ ఘటన జరిగింది. కాగా ఉత్తర భారతదేశంలోని బిహార్, ఉత్తరప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఈ వరదల ధాటికి ఇప్పటికే 80కి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ets.js" charset="utf-8">