ఏపీ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి: వైవీ సుబ్బారెడ్డి

2 Aug, 2019 20:42 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం టీటీడీ చైర్మన్‌ హోదాలో ఆయన తొలిసారి ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌లను కలిశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలను వారికి అందించారు. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలని విన్నవించారు. అనంతరం స్వామీ స్వరూపానంద ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. అక్కడ చతుర్మాస దీక్షలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు