కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన టీటీడీ చైర్మన్‌

26 Sep, 2019 20:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజనాథ్‌సింగ్‌ను కలిశారు. గురువారం ఢిల్లీ వెళ్లి తిరుమల  వార్షిక బ్రహ్మోత్సవాలకు హజరుకావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి రాజనాథ్‌సింగ్‌కు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రికను అందించారు. కాగా ఈ నెల 29న తిరుమల తిరుపతి ఆలయంలో అంకురార్పణ అనంతరం 30వ తేది నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఆక్టోబర్‌ 8న చక్ర స్నానంతో ముగియనున్నాయి. 

>
మరిన్ని వార్తలు