-

ఆప్ కీ అదాలత్ నుంచి లక్ష్మీ పార్వతికి ఆహ్వానం

1 Dec, 2014 09:59 IST|Sakshi

ఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణ లక్ష్మీ పార్వతికి ఆప్ అదాలత్ నుంచి ఆహ్వానం అందింది. ఇండియా టీవీ నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. తాజాగా లక్ష్మి పార్వతి ఆప్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం అందడంతో అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. ‘ఆప్ కీ అదాలత్’ ప్రారంభించి 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 21న నిర్వహించే కార్యక్రమంలో వీరు పాలుపంచుకోనున్నారని ‘ఇండియా టీవీ’ తెలిపింది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో సహా సీనియర్ మంత్రులు కూడా ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు