గో రక్షకులూ.. వెంటనే రువాండా వెళ్లండి...!

24 Jul, 2018 21:06 IST|Sakshi

దేశంలోని గో రక్షకులకు బహిరంగ విజ్ఞప్తి... మీరంతా దయచేసి వెంటనే రువాండా దేశానికి వెళ్లి ఈ ఆవుల పరిరక్షణకు చర్యలు తీసుకోండి. ప్లీజ్‌...

దక్షిణాష్రికా బ్రిక్స్‌ శిఖరాగ్ర భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనేందుకు వెళుతూ మార్గమధ్యంలో రువాండాలో ఆగి 200 ఆవులను కానుకగా ఇచ్చారు. దీనిపై ట్విటర్‌ వేదికగా సాగిన  హాస్యపూర్వకచర్చలో భాగంగానే ఈ విజ్ఞప్తి సోషల్‌ మీడియా తెరపైకి వచ్చింది.  రువాండాలో కొన్ని శతాబ్దాలుగా ‘గిరింకా పథకం’లో భాగంగా గోవులను కానుకగా ఇవ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది. గౌరవం, కృతజ్ఞతను వ్యక్తపరచడంలో భాగంగా ఒకరి నుంచి మరొకరికి ఆవులు అందజేస్తారు. అయితే రువాండాలో బీఫ్‌ను ఆహారంలో భాగంగా పరిపాటి కావడంతో ఈ అంశం ట్విటర్‌లో చర్చకు కేంద్రమైంది. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో  బీఫ్‌ను నిషేధించడంతో పాటు ఇటీవల గోవుల పరిరక్షణపేరిట మూక దాడుల సంబంధిత వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ట్విటర్‌లో సరదా కామెంట్లు...

  • రువాండాలోని బుగెసెరలో అతి పెద్ద బీఫ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ రాబోతోంది. ఆ దేశానికే ప్రధాని మోదీ ప్రేమతో 200 ఆవులు కానుకగా ఇచ్చారంటూ ఓ వ్యక్తి స్పందించాడు=మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌...200 ఆవులు కానుకగా ఇచ్చేశారు అని ఆప్‌కా దేవేందర్‌ అకౌంట్‌ నుంచి పోస్ట్‌ చేశారు
  • రువాండాలో మాంసం కొరత ఏర్పడింది అనే శీర్షికతో... రెండుదేశాల్లోనూ ఆవులను పూజిస్తారు. అయితే ఈ ఫోటోను చూడాలంటే భయమేస్తోంది అంటూ రువాండాలో బీఫ్‌ అమ్మే ఫోటోను రోహిత్‌ కన్నన్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు
  • ఆ దేశంలో గోవులను ఇష్టపడతారు. అయితే డైనింగ్‌ టేబుళ్ల మీద...అక్కడ గోరక్షకుల దళాన్ని వెంటనే ఏర్పాటుచేయాలి.  దళ సభ్యులంతా కూడా రాత్రికి రాత్రి ప్యారాఛూట్లలోఅవసరమైన చోట్ల దిగే ఏర్పాటు చేయాలి అంటూనైనా డీ షేత్‌ పేర్కొన్నారు
  • రువాండాకు 200 ఆవులను ఎత్తుకెళుతున్న వారు కనిపించారని మై ఫెల్లో ఇండియన్స్‌ అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు
  • ఓ వ్యక్తి  ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు గోవులను తీసుకెళుతుంటేనే దాడి జరిగింది. మరో వ్యక్తి  భారత్‌ నుంచి 200 ఆవులను తీసుకుని రువాండాకు వెళ్లినట్టు ఇప్పుడే విన్నాను. అతడికి ఏమి కాకూడదని ప్రార్థిస్తున్నాను అని అతుల్‌ ఖత్రి వ్యాఖ్యానించాడు.

>
మరిన్ని వార్తలు