బాలికపై అత్యాచారం, ఆఫ్ఘన్ యువకులు అరెస్ట్

28 Oct, 2016 20:24 IST|Sakshi
బాలికపై అత్యాచారం, ఆఫ్ఘన్ యువకులు అరెస్ట్
కృష్ణరాజపుర(కర్ణాటక): మణిపూర్ రాష్ట్రానికి చెందిన పదహారేళ్ల బాలికపై ఇద్దరు విదేశీయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం బెంగళూరులోని కృష్ణరాజపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విద్యార్జనలో భాగంగా అఫ్ఘానిస్తాన్‌కు చెందిన ముస్తఫా జలాల్, కరం అబ్దుల్లా అహ్మద్ బెంగళూరు వచ్చారు. ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు. 
 
కృష్ణరాజపురలో నివాసం ఉంటున్న మణిపూర్‌కు చెందిన బాలిక ఈ నెల 26న టీసీపాళ్యలో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాత్రి తిరిగి తన గదికి నడుచుకుంటూ వెళుతుండగా కారులో అటుగా వచ్చిన ముస్తఫా జలాల్, కరం అబ్దుల్లా గమనించారు. ఆ అమ్మాయిని డ్రాప్ చేస్తామంటూ వాహనంలో ఎక్కించుకున్నారు. అనంతరం గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం కష్ణరాజపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
మరిన్ని వార్తలు