ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. పశ్చిమ ఢిల్లీలోని రోహిణి ఏరియాలో పోలీసులకు, నేరస్తులకు మధ్య దాదాపు రెండు గంటల పాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. కాల్పులు జరిపిన నేరస్థులను సుధీర్ కలా, అభయ్ లుగా గుర్తించారు. బేగంపూర్ కు చెందిన ప్రాపర్టీ డీలర్ ను లక్ష్యంగా చేసుకొని ఆయన కారుపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అడ్డగించిన పోలీసులపై కూడా కాల్పులకు దిగారు. దీంతో ఆప్రాంతం ఉద్రిక్తంగా మారింది.