ఢీ కొన్న ఎన్టీపీసీ రైళ్లు

1 Mar, 2020 13:13 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో వేకువజామున రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలిలో తెల్లవారుజామున 4.30 నిమిషాలకు బొగ్గును తీసుకువెళుతున్న కార్గో రైలు ఎదురుగా వస్తున్న మరో కార్గో రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా ఒకరు శిథిలాల కింద చిక్కుకున్నారు. అతడిని సురక్షితంగా బయటికి తీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ రెళ్లు పూర్తిగా నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలోనే నడుస్తాయని కేంద్ర రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

>
మరిన్ని వార్తలు