మారణహోమానికి పాక్​ కుట్ర

11 Jul, 2020 16:10 IST|Sakshi

ఎల్వోసీలోకి చొరబడిన టెర్రరిస్టులను మట్టుబెట్టిన దళాలు

శ్రీనగర్​: భారత్​లో మరో మారణహోమానికి పాకిస్తాన్​ కుట్ర పన్నింది. ఆర్టికల్​ 370 రద్దై ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో జమ్మూకాశ్మీర్లో అలజడి రేపేందుకు పెద్ద ఎత్తున మారణాయుధాలతో టెర్రరిస్టులను పంపుతోంది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు ఏకే–47 తుపాకులు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లు, చైనా తయారీ హ్యాండ్​ గన్స్​, ఆస్ట్రియా టెక్నాలజీతో పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన హ్యాండ్​ గ్రెనేడ్​లతో కుప్వారా జిల్లా వద్ద గల ఎల్వోసి బోర్డర్​ను దాటారు.(‘రెమ్‌డెసివిర్ ద్వారా మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గే అవ‌కాశం‌’)

దాదాపు వంద మీటర్లు లోపలికి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను సిక్కు లైట్​ ఇన్​ఫాంట్రీకి చెందిన సైనికులు మట్టుబెట్టినట్లు జమ్మూ కాశ్మీర్​ పోలీసులు వెల్లడించారు. టెర్రరిస్టులు ఇద్దరిలో ఒకరిని కుప్వారాకు చెందిన ఇద్రిస్​ అహ్మద్​ భట్​(23)గా గుర్తించినట్లు తెలిపారు. 2018లో ఇద్రిస్​ పాకిస్తాన్​ వెళ్లాడని వివరించారు. ఇరువురూ లష్కర్​ ఈ తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు వెల్లడించారు.(లాక్‌డౌన్‌: లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్‌)

ఐఎస్​ఐ ప్రోద్భలంతో ఉగ్రవాదులు చైనాకు చెందిన డ్రోన్లతో ఆయుధాలు స్మగ్లింగ్​ చేస్తారనే సమాచారంతో ఎల్వోసీ వద్ద ముందుస్తుగా నిఘాను పెంచినట్లు భారత ఆర్మీ అధికారి మేజర్​ జనరల్​ వీరేంద్ర పేర్కొన్నారు. ఫెన్సింగ్​ కట్​ చేసి కాశ్మీర్​లోకి చొరబడిన టెర్రరిస్టులను సైనికులు అడ్డుకున్నట్లు చెప్పారు.

పార్లమెంటుపై దాడిలో ఇవే గ్రెనేడ్లు
2001లో ఇండియా పార్లమెంటుపై జైషే ఈ మహమ్మద్​ చేసిన ఉగ్రదాడిలో వాడిన గ్రెనేడ్లు, శనివారం టెర్రరిస్టుల వద్ద లభించిన గ్రెనేడ్లు ఒకే రకానికి చెందినవి. వీటితో 20 మీటర్ల పరిధిలో ఉన్న అందరినీ చంపొచ్చు.

చైనా నుంచి అందుకున్న డ్రోన్లతో పాకిస్తాన్​ పంజాబ్​లోకి డ్రగ్స్​, ఆయుధాలను పంపుతోంది. దీంతో సరిహద్దుల్లో డ్రోన్లను కూల్చివేసే యాంటీ డ్రోన్​ సిస్టమ్స్​ను మోహరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు