మద్రాస్‌ ఐఐటీలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య

14 Jul, 2016 10:54 IST|Sakshi

చెన్నై: మద్రాస్‌ ఐఐటీలో ఇద్దరు మహిళలు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ గదుల్లో ఉరి వేసుకుని విజయలక్ష్మీ, మహేశ్వరి అనే మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ప్రొఫెసర్‌ గణేశన్‌ భార్య విజయలక్ష్మీ, రీసెర్చ్ స్కాలర్  మహేశ్వరి (34) ఉన్నట్టు తెలిసింది. కాగా రీసెర్చ్ స్కాలర్ మృతి పట్ల ఐఐటీ మద్రాస్ వర్సిటీ సంతాపం తెలిపింది. మృతురాలి కుటుంబానికి సానుభూతి తెలిపింది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మహేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇక మరో మహిళ విజయలక్ష్మి మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు