ఎయిమ్స్ నుంచి ఉమా భారతి డిశ్చార్జ్

27 Jun, 2016 19:02 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీనొప్పితో ఆమె శుక్రవారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అనీజినెస్తో పాటు ఛాతినొప్పితో ఉమా భారతి ఆస్పత్రిలో చేరినట్లు జలవనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా వెన్ను, మోకాళ్లలో వణుకుపై వైద్యులు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు