‘మందిరం’ కోసం చావడానికైనా రెడీ

9 Apr, 2017 00:47 IST|Sakshi

ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు
లక్నో: రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమని, మందిరం కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. ‘రామ మందిరం విశ్వాసానికి సంబంధించిన అంశం. దానిపై నాకెంతో గౌరవం ఉంది. మందిరం కోసం జైలుకెళ్లడానికైనా, ఉరేసుకోడానికైనా సిద్ధం’ అని చెప్పారు. ‘రామ మందిరంపై చర్చించాల్సిందేమీ లేదు. ఈ అంశం మాకేం కొత్త కాదు. రామ మందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్‌ గురువు అవైద్యనాథ్‌ నాయకుడు’ అని వివరించారు.

మరిన్ని వార్తలు