బడ్జెట్‌పై నేడు ఢిల్లీలో మంత్రుల సమావేశం

26 Dec, 2014 06:12 IST|Sakshi
బడ్జెట్‌పై నేడు ఢిల్లీలో మంత్రుల సమావేశం

సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో పాల్గొనేందుకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. స్థూల ఆర్థిక విధానం, ద్రవ్య సుస్థిరతకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంపై దృష్టి సారించనున్నారు.
 

మరిన్ని వార్తలు