కేంద్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

1 Feb, 2018 11:09 IST|Sakshi
లోక్‌సభలో బడ్జెట్‌ ప్రసంగం చదువుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ


సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్‌సభలో 11గంటలకు బడ్జెట్‌ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. జైట్లీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. ఎన్డీయే సర్కార్‌కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కేంద్రానికి అతిముఖ్యమైనది కాగా ఇదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క, కేంద్రం జీఎస్‌టీని గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వస్తున్న తొలి బడ్జెట్‌ కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు మీ కోసం..

కేంద్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

మొత్తం బడ్జెట్‌ రూ.21.57లక్షల కోట్లు
ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతం
వచ్చే ఏడాదికి 3.3కు తగ్గిస్తామని అంచనా

  బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి ముందు...

  • తన ఇంటి నుంచి బడ్జెట్‌ బ్రీఫ్‌ కేసుతో ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్న అరుణ్‌జైట్లీ, బడ్జెట్‌ రూపకల్పనా బృందం
  • తొలుత మీడియాకు బడ్జెట్‌ బ్రీఫ్‌ కేసును చూపిస్తూ ఫొటోలు
  • బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన అరుణ్‌ జైట్లీ
  • పార్లమెంటుకు చేరుకున్న బడ్జెట్‌ పత్రాలు.. భద్రతా బలగాల తనిఖీ పూర్తి
  • బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు పార్లమెంటుకు చేరుకున్న అరుణ్‌ జైట్లీ
  • కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభం. బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్‌
  • బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌
  • లోక్‌సభ హాల్‌ వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌, తదితరులు
  • లోక్‌సభ సమావేశం ప్రారంభం

బడ్జెట్‌ను చదవడం ప్రారంభించిన జైట్లీ.. కీలక అంశాలు
నాలుగేళ్ల కిందట పారదర్శకత పాలన అందిస్తామని చెప్పాం
మేం అధికారంలోకి వచ్చే నాటికి విధానపరమైన పక్షపాతం ఉంది
మోదీ నేతృత్వంలో వ్యవస్థీకృత సంస్కరణలు అమలవుతున్నాయి
కొత్త భారత్‌ను మేం ఆవిష్కరిస్తున్నాం
జీఎస్టీతో పేదలకు మేలు జరిగింది
భారత్‌ 7శాతం వృద్ధిని సాధిస్తుందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది.
ప్రపంచంలోనే ఏడో పెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా భారత్‌ ఉంది. మేం ఐదో స్థానంలోకి తీసుకెళ్లేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం
ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ ఉంది

వ్యవసాయం, గ్రామీణం, సంక్షేమం

  • ఈ బడ్జెట్‌లో వ్యవసాయంతోపాటు, గ్రామీణరంగం, సంక్షేమ రంగంపై దృష్టి సారించాం.
  • గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి రంగానికి అత్యధిక రూ.14.34లక్షల కోట్లు
  • మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది.
  • రైతుల ఆదాయం పెంచేందుకు దృష్టి సారించాం
  • రైతులు 50శాతం లాభాలు సాధించారు
  • వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది
  • సౌర విద్యుత్‌ను మరింత ప్రోత్సహిస్తాం
  • నేషనల్‌ బ్యాంబూ మెషిన్‌కు రూ.1200 కోట్లు
  • వెదురు పరిశ్రమకు మరింత ఊతం అందించనున్నాం
  • ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం
  • వ్యవసాయ మార్కెట్‌ల అభివృద్ధికి రూ.2000 కోట్లు
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్లు
  • ఫుడ్‌ ఫ్రాసెసింగ్‌ కోసం 42 కేంద్రాలు ఏర్పాటు
  • ఆర్గానిక్‌ వ్యవసాయానికి కేంద్రం తోడ్పాటును అందిస్తుంది
  • వ్యవసాయ ఎగుమతులను సరళీకృతం చేస్తున్నాం
  • పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు ఉండేలా మద్ధతు ధర నిర్ణయిస్తాం
  • పంట కొనే విషయంలో రాష్ట్రాలతో మాట్లాడి ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం
  • ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.లక్షా 5వేల కోట్లు
  • కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చేలా కొత్త విధానం
  • వచ్చే ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు
  • దిగువ తరగతి వారికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 50 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
  • ఉజ్వల పథకం కింద 8 కోట్ల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు
  • ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు రూ.1600 కోట్లు
  • సాగునీటి కోసం నాబార్డుతో కలిసి ప్రత్యేక విధానం
  • చేపల పెంపకం, పశుసంవర్థకానికి రూ.10వేల కోట్లు
  • జాలర్లకు క్రెడిట్‌ కార్డులు
  • ఆపరేషన్‌ గ్రీన్‌కు రూ.500 కోట్లు
  • సౌర విద్యుత్‌ను మరింత ప్రోత్సహిస్తాం
  • ప్రభుత్వం ఇచ్చే ఏ ప్రయోజనం అయినా నేరుగా ప్రజల ఖాతాల్లో వేస్తున్నాం
  • ఎస్టీలకు రూ.39,115 కోట్లు కేటాయింపు
  • ఎస్సీలకు రూ.56,619కోట్లు కేటాయింపు
  • పేద, మధ్యతరగతి వర్గాలు హాయిగా బతికేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాం.

విద్యారంగం

  • విద్యారంగంలో మౌలిక అభివృద్ధికి రూ.లక్షకోట్లతో నిధి
  • నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేయనున్నాం.
  • కొత్తగా 18 ఆర్కిటెక్చర్‌ కాలేజీల ఏర్పాటు
  • స్కూల్‌ టీచర్ల శిక్షణకు ప్రత్యేక స్కూళ్లు
  • డిజిటల్‌ విద్యావిధానానికి మరింత చేయూత
  • విద్యాభివృద్ధి కోసం జిల్లా కేంద్రంగా ప్రణాళిక
  • ఈ ఏడాది నుంచి పీఆర్‌ఎఫ్ ‌(ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌). టాప్‌ వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులకు ఫెలోషిప్‌లు
  • గ్రూప్‌ సీ, డీలలో ఇంటర్వ్యూలను ఇప్పటికే రద్దు చేశాం

వైద్య రంగం

  • ఆరోగ్య రంగానికి భారీగా నిధులు. రూ.లక్షా 38 వేల కోట్లు కేటాయింపు
  • ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. పది కోట్ల కుటుంబాలకు లబ్ధి
  • ఆయుష్మాన్‌ భవ పథకంతో అందరికీ ఆరోగ్యం
  • ఆయుష్మాన్‌ భవ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్‌ కవరేజి. రూ.330 చెల్లిస్తే కుటుంబానికి ఆరోగ్య బీమా
  • జీవన ప్రమాణ పెంపునకు పైలెట్‌ ప్రాజెక్టు కింద 116 జిల్లాలు ఎంపిక
  • ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా అభివృద్ధి
  • టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి
  • టీబీ రోగులకు వైద్యం సమయంలో పౌష్టికాహారానికి నెలకు రూ.500
  • కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలకు అనుమతి
  • ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు

పారిశ్రామిక రంగం

  • చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు రూ.3794 కోట్లు
  • పరిశ్రమలకు ఆన్‌లైన్‌ ద్వారా మరిన్ని రుణాలు
  • పరిశ్రమలకు ఆధార్‌ తరహా మరో కార్డులు
  • జౌళి రంగానికి రూ.7148 కోట్లు
  • కార్పోరేట్‌ పన్ను 2శాతం తగ్గింపు
  • వచ్చే మూడేళ్లకుగాను భవిష్యనిధికి 12శాతం నిధులు చెల్లింపు

పట్టణాలకు..

  • అమృత్‌ ప్రోగ్రాం కింద 500 నగరాలకు నీటి సరఫరా. ఇప్పటికే 494 కాంట్రాక్టులకోసం రూ. 19,428 కోట్లు కేటాయింపులు
  • 10 ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుర్తించి వాటిని మరింత అభివృద్ధి చేయనున్నాం
  • భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి చేస్తాం
  • దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల కింద 99 నగరాలు ఎంపిక. రెండు లక్షల కోట్లు కేటాయింపు.

     

రైల్వేలు-రహదారులు-ఎయిర్‌వేస్‌

  • రైల్వే భద్రతకు పెద్ద పీట, సాంకేతిక పరిజ్ఞానం మరింత ఉపయోగించనున్నాం.
  • రైల్వేకు రూ.1,48,000కోట్లు కేటాయింపు
  • రైళ్ల ఆధునీకరణకు ముందడుగు. కొత్తగా రైల్వేలకు 12,000 వ్యాగన్లు, 5160కోచ్‌లు, 700 లోకోమోటివ్స్‌.
  • అన్ని రైల్లే స్టేషన్లలో దశలవారిగా వైఫై, సీసీటీవీల ఏర్పాటు
  • 25 వేలమంది ప్రయాణీకులు వచ్చే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు
  • 36 వేల కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ల పునరుద్ధరణ
  • 4వేల కిలో మీటర్ల మేర కొత్తగా రైల్వే మార్గం
  • 18 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు
  • దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లు గుర్తించి వాటి అభివృద్ధి
  • భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి చేస్తాం
  • ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుతం 124 ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా వాటిని 5 రెట్లు పెంచనున్నాం. ఏడాదికి బిలియన్‌ ట్రిప్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం
  • ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం ద్వారా 56 అన్‌ రిజర్వడ్‌ ఎయిర్‌పోర్ట్‌ల, 31 అన్‌ సర్వడ్‌ హెలిప్యాడ్ల అనుసంధానం
  • దేశ వ్యాప్తంగా రహదారులు, ఎయిర్‌పోర్ట్‌లు, నౌకశ్రయాలకు మధ్య అనుసంధానం

పెరిగిన రాష్ట్రపతి వేతనం

  • రాష్ట్రపతి వేతనం రూ.5లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం 4లక్షలు, గవర్నర్‌ వేతనం రూ.3.5లక్షల వేతనం (నెలకు)
  • ప్రతి ఐదేళ్లకొకసారి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వేతనాలపై సమీక్ష
  • ఎంపీల జీతాల పెంపుపై రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు
  • ప్రతి ఐదేళ్లకొకసారి ఎంపీల వేతనం పెంపు

పన్నులు- ప్రత్యక్షం/పరోక్షం

  • వ్యక్తిగత పన్ను శ్లాబులు యధాతథం
  • వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
  • గత ఏడాది ప్రత్యక్ష పన్నులు 12.6శాతం పెరిగాయి
  • కొత్తగా 81లక్షల ఐటీ రిటర్న్స్‌ దాఖలు
  • ఆదాయ పన్ను పరిధిలోకి కొత్తగా ఐదు లక్షల మంది
  • అదనంగా 90 వేల కోట్ల  పన్ను వసూలు
  • వృద్ధులకు బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు
  • వృద్ధులకు రూ.50 వేల వరకు వైద్య ఖర్చులకు పన్ను మినహాయింపు. ఉద్యోగులకు రూ.40 వేల వరకు వైద్య ఖర్చులకు పన్ను మినహాయింపు
  • కార్పొరేట్‌ ట్యాక్స్‌ 25శాతానికి పెంపు.. దీని ద్వారా రూ.250 కోట్ల ఆదాయం టార్గెట్‌
  • వచ్చే ఏడాది ద్రవ్యలోటును 3.3శాతానికి తగ్గిస్తాం
  • ఈ ఏడాది దవ్యలోటు జీడీపీలో 3.5శాతం
  • స్టాంప్‌ డ్యూటీల విషయంలో కొత్త విధానం
  • ప్రతి వ్యాపార సంస్థకు యూనిక్‌ ఐడీ విధానం
  • బ్యాంకులకు మూలధనం కింద రూ.5లక్షల కోట్ల కేటాయింపు

Liveblog

మరిన్ని వార్తలు