సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

17 Sep, 2016 07:15 IST|Sakshi
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ: అఖిల భారత స్థాయి ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్స్‌ ప్రాథమిక పరీక్షల (ప్రిలిమ్స్‌) ఫలితాలను శుక్రవారం యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) విడుదల చేసింది. ఆగస్టు 7న జరిగిన ఈ పరీక్షకు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన ఉద్యోగార్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌లోని నిర్దేశిత పేజీకి వెళ్లి తమ పూర్తి సమాచారం నింపి దరఖాస్తు చేయాలనీ, ఈ పేజీ అక్టోబరు 7 నుంచి 20 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్‌ పేర్కొంది. తుది ఫలితాలు వెలువడిన తర్వాతనే అభ్యర్థుల మార్కులు, కటాఫ్‌ మార్కులు, సమాధానాల కీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని యూపీఎస్సీ చెప్పింది.

మరిన్ని వార్తలు