న్యూఢిల్లీ: సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ల్యాప్టాప్లు, బ్లూటూ త్ పరికరాలను పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చే అభ్యర్థుల్ని భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరవకుండా డీబార్ చేస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) హెచ్చరించింది. పరీక్షా కేంద్రాలకు ఎటువంటి విలువైన వస్తువులు తీసుకురావద్దని సూచించింది. జూన్ 18న సివిల్స్ సర్వీస్ పరీక్ష జరుగనున్న నేపథ్యంలో యూపీఎస్సీ ఈ మేరకు స్పందించింది.