గవర్నర్గా విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం

30 Aug, 2014 18:12 IST|Sakshi
విద్యాసాగర్ రావు

ముంబై: మహారాష్ట్ర గవర్నర్గా బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు  ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భన్లో బొంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా  విద్యాసాగర్‌రావు  చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్, అతని మంత్రి వర్గ సహచరులు, ఇతర ముఖ్యులు హాజరయ్యారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఈ నెల 27న  నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే.   మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్‌రావు, రాజస్థాన్ గవర్నర్‌గా కల్యాణ్ సింగ్‌, కర్ణాటక గవర్నర్‌గా వజూభాయ్ వాలా, గోవా గవర్నర్‌గా మృదులా సిన్హాలను నియమించారు.

మరిన్ని వార్తలు