సాధువుల ఎన్నికల్లో డిష్యుం..డిష్యుం

12 May, 2016 16:01 IST|Sakshi
సాధువుల ఎన్నికల్లో డిష్యుం..డిష్యుం

ఉజ్జయిని: మధ్యప్రదేశ్లో సాధువుల ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఉజ్జయినిలో జరిగిన సాధువుల సంఘం ఎన్నికల ఫలితాలు  గురువారం ఉదయం వెలువడ్డాయి.

దీంతో ఓడిపోయిన వర్గానికి చెందిన కొందరు మరో వర్గంపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 20 మంది వరకు సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. గాయపడిన సాధువులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు