అమిత్ షాకు జెడ్ ప్లస్ భద్రత

3 Jul, 2014 03:23 IST|Sakshi
అమిత్ షాకు జెడ్ ప్లస్ భద్రత

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్‌షాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు. అమిత్ షా భద్రతకు తీవ్రమైన ముప్పు ఉందన్న భావనతోనే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయంతీసుకున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. జెడ్‌ప్లస్ కేటగిరీలో భాగంగా, అమిత్ షాకు సీఆర్‌పీఎఫ్ కమాండోలు 24గంటలూ భద్రత కల్పిస్తారని, ఆయన ఇంటివద్ద సాయుధ గార్డులు ఉంటారన్నాయి. అమిత్ దేశంలో ఎక్కడికి వెళ్లినా, ఆయనకు ఉన్నతస్థాయి భద్రత కల్పిస్తారు. ఆయనకు ఇప్పటి వరకూ గుజరాత్ పోలీసుల భద్రత కల్పిస్తూవస్తున్నారు.

మరిన్ని వార్తలు