అతిపెద్ద జల్లికట్టులో.. విషాదం

20 Jan, 2019 13:19 IST|Sakshi

సాక్షి, చెన్నై : గిన్నీస్‌ బుక్‌ రికార్డు కోసం తమిళనాడులో అధికారులు ఏర్పాటు చేసిన అతిపెద్ద జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో జల్లికట్టులో ఎద్దు కుమ్మేయటంతో పుదుకోటైకి చెందిన రాము అనే వ్యక్తి మృతిచెందారు. విరాళీమలైలో సీఎం పళణిస్వామి ఆదివారం జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. దీనిలో 2500 ఎద్దులు, 3వేల మంది యువకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు