మీ ఫోన్‌లోని ‘టిక్​టాక్’​కు ఏమవుతుందో తెలుసా?

30 Jun, 2020 12:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్​పై ఇండియా నిషేధం విధించింది. వీటిలో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన టిక్​టాక్ కూడా ఉంది. నిషేధాజ్ఞలతో ఇప్పటికే టిక్​టాక్​ను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్ తొలగించింది. అయితే, ఇప్పటికే టిక్​టాక్​ను ఇన్​స్టాల్​ చేసుకున్న వారి పరిస్థితేంటి? ఆ యాప్​ పని చేస్తుందా? లేదా దాన్ని వెంటనే అన్​ఇన్​స్టాల్ చేసేయాలా? ప్రభుత్వం నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందా? (చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్‌)

టిక్​టాక్​తో పాటు మరో 58 యాప్స్ ను ఇండియా బ్యాన్​ చేయడం వెనకున్న అసలు కారణం ‘డేటా’. ఈ 59 యాప్స్​తో ఇండియన్స్ డేటాను చైనా కంపెనీలు తస్కరిస్తున్నాయి. బ్యాన్​ విధింపుతో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు(ఐఎస్పీ), టెలికాం సర్వీసు ప్రొవైడర్లు(టీఎస్పీ) ఈ యాప్స్​ ఇండియాలో డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ యాక్సెస్​ చేయకుండా బ్లాక్ చేస్తాయి. ఈ మేరకు ఐఎస్పీ, టీఎస్పీలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. (ముప్పై ఏళ్లలో 13 హత్యలు.. 50 రేప్‌లు)

ఇప్పటికే ఆయా ఫోన్లలో ఇన్​స్టాల్ అయి ఉన్న యాప్స్  ఇప్పటివరకైతే మామూలుగానే పనిచేస్తున్నాయి. ఇండియాలో ఉన్న అన్నీ యాప్స్ స్టోర్స్ టిక్​టాక్​తో సహా నిషేధానికి గురైన ఏ యాప్​కూ అప్​డేట్స్ చూపించవు. అయినా ఫోన్లలో ఆ యాప్స్​ను ఉంచుకుంటే భద్రత తగ్గి హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువ. గతంలో ఓ యాప్ నిషేధానికి గురైతే డేటాతో సంబంధం లేకుండా పని చేసేది. కానీ ఇండియన్ నెట్​వర్క్స్​ కూడా ఈ 59 యాప్స్​కి డేటా సరఫరా చేయొద్దని ఆదేశాలు అందడంతో భారత్​లో ఇవి పని చేయడం అసాధ్యం. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన)

మరిన్ని వార్తలు