ఆ నష్టాలకు బాధ్యులు ఎవరు?

4 Jan, 2016 20:24 IST|Sakshi
ఆ నష్టాలకు బాధ్యులు ఎవరు?

న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నష్టాలపై అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా నష్టాలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించింది. 'ప్రైవేటు ఎయిర్ లైన్స్ లాభాల్లో నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియా మాత్రం నష్టాల్లో ఉంది. ఎయిర్ ఇండియా కష్టాలకు కారణం ఎవరు? దీనికి సంబంధించి చాలా కథనాలు విన్పిస్తున్నాయి' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఆర్ బానుమతిలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.

ట్రయల్ బేసిస్ మీద సిమ్లా, ఢిల్లీ మధ్య విమానాలు నడపాలని హిమచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన  తీర్పును వ్యతిరేకిస్తూ ఎయిర్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఎయిర్ ఇండియా తరపున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు