సంజయ్ దత్కు బాంబే హైకోర్టులో చుక్కెదురు

12 Jun, 2017 18:01 IST|Sakshi
సంజయ్ దత్కు బాంబే హైకోర్టులో చుక్కెదురు

ముంబై :
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్రా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పెరోల్ పై సంజయ్ దత్ విడుదలను తప్పుపట్టింది. 8 నెలల ముందే జైలు నుంచి ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. సంజయ్ ముందస్తు విడుదలపై సమాధానం చెప్పాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది.

కాగా, 1993 ముంబై బాంబుపేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న నేరంపై కోర్టు సంజయ్ దత్కు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సత్ర్పవర్తన కారణంగా ఎనిమిది నెలల శిక్ష మిగిలి ఉండగానే జైలు నుంచి విడుదల చేశారు.

మరిన్ని వార్తలు