వాళ్లందరినీ హిందూ మతంలోకి మారుస్తాం: తొగాడియా

29 Dec, 2014 15:40 IST|Sakshi
వాళ్లందరినీ హిందూ మతంలోకి మారుస్తాం: తొగాడియా

ముస్లింలు, క్రిస్టియన్లు అందరినీ హిందూ మతంలోకి మారుస్తామని విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాన్ని తేవాలని, తాము దాన్ని సమర్థిస్తామని ఆయన చెప్పారు.

హిందూమతం అనేది ఒక జీవన విధానమని, ప్రతి హిందువు తోటి హిందువు కోసం రోజుకు పిడికెడు బియ్యం, పది రూపాయలు పక్కన పెడితే హిందువులన్నవాళ్లు ఎవరూ పేదలు కారని ఆయన చెప్పారు. ముస్లింల రిజర్వేషన్లను తాము వ్యతిరేకిస్తామని ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు