మోదీని షారుఖ్ మించిపోయారు

30 Mar, 2015 13:20 IST|Sakshi
మోదీని షారుఖ్ మించిపోయారు

ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోదీని మించిపోయారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో షారుఖ్కు ఫాలోవర్స్ మోదీని మించిపోయారు. షారుఖ్ 2010 జనవరి 2న ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. మోదీకి ప్రస్తుతం 11.1 మిలియన్ అభిమానుల ఫాలోయింగ్ ఉండగా.. గత శనివారం నుంచి షారుఖ్కును ఫాలో అయ్యేవారి సంఖ్య 12 మిలియన్ల (కోటీ 20లక్షల) చేరుకుందని, దీంతో ఆయనను మోదీకన్నా ముందున్నారని ట్విట్టర్ పేర్కొంది. ఇదిలాఉండగా, బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ 13.9 మిలియన్ల ఫాలోవర్స్తో వీరిద్దరి కన్నా ముందు వరుసలో ఉన్నారు.

మరిన్ని వార్తలు