మా అనుమతి లేకుండా నియమించొద్దు

18 Dec, 2014 03:38 IST|Sakshi
  • సీవీసీ, వీసీలపై కేంద్రానికి సుప్రీం ఆదేశం
  • న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ), విజిలెన్స్ కమిషనర్(వీసీ)లను నియమించే ముందు తమ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఎంపిక ప్రక్రియ గురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. ‘‘ఎవరిని నియమించారన్నది మాకు అవసరం లేదు.

    కానీ తగిన పద్ధతిలో ఆ నియామకం జరిగిందా లేదా అన్నది చూడడమే మా కర్తవ్యం. ఇకపై మా అనుమతి లేకుండా ఆయన(అటార్నీ జనరల్) ఈ నియామకాల విషయంలో చర్యలు తీసుకోరని మేం విశ్వసిస్తున్నాం.

    మీరు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లడానికి ముందు మా దగ్గరకు రండి(అనుమతి కోసం)’’ అని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ.. సీవీసీ, వీసీల ఎంపిక ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతిచ్చింది.
     

>
మరిన్ని వార్తలు