ఒక్క వర్గానికే కొమ్ము కాస్తాయి: అమిత్ షా

14 Aug, 2016 04:25 IST|Sakshi
ఒక్క వర్గానికే కొమ్ము కాస్తాయి: అమిత్ షా

కాకోరి: ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాకోరిలో శనివారం తిరంగా యాత్ర'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్వాది పార్టీ అధికారంలోకి వస్తే యూపీ అభివృద్ధి చెందుతుందా? 24 గంటలూ కరెంట్ ఇస్తారా? బులంద్షహర్ గ్యాంగ్రేప్ ఘటన లాంటి కేసులు ఆగుతాయా అని ప్రశ్నలు వర్షం కురిపించారు.

సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్వాది పార్టీ అధికారంలోకి వస్తే ఒక వర్గం కోసమే పనిచేస్తాయని ఆరోపించారు. బీజేపీ అన్ని వర్గాల అభివృద్ధికి పాటు పడుతుందని హామీయిచ్చారు. 'సబ్ కా సాత్, సబ్ వికాస్' తమ అమిత్ షా విధానమనిగుర్తు చేశారు.

మరిన్ని వార్తలు