రైల్వే స్టేషన్లో మహిళపై గ్యాంగ్రేప్

27 Feb, 2015 20:45 IST|Sakshi
రైల్వే స్టేషన్లో మహిళపై గ్యాంగ్రేప్

హౌరా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. భర్త ఎదురుగానే ఓ మహిళపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతి పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హౌరా జిల్లా మోరిగాం రైల్వే స్టేషన్లో భర్తతో కలిసి రైలు దిగిన అనంతరం నలుగురు వ్యక్తులు వారిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

 

గత రాత్రి వెస్ట్ మిడ్నాపూర్లో దిగాల్సిన దంపతులు నిద్ర మత్తులో ఉన్న కారణంగా మోరిగాం చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.  ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు