నదిలో స్నానానికి దిగిన మహిళపై మొసలి...!

31 Aug, 2014 14:58 IST|Sakshi
కేంద్రపారా: మొసలి జరిపిన దాడిలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి.  ఈఘటన ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని నలాదియా వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. నదిలో స్నానానికి దిగిన 55 ఏళ్ల మహిళపై మొసలి దాడి చేసినట్టు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. స్నానం చేయడానికి నీళ్లలోకి దిగిన ద్రౌపది ప్రధాన్ అనే మహిళను మొసలి నోట కరుచుకుని నదిలోపలికి లాగుతుండగా... ఆమెతో వచ్చిన మరో యువతి కాపాడిందని అధికారులు తెలిపారు. 
 
తీవ్రగాయాల పాలైన ఆమెను రాజనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి చికిత్సనందిస్తున్నామని అధికారులు తెలిపారు. యువతి చికిత్స కోసమయ్యే ఖర్చులను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ చెల్లిస్తోందని తెలిపారు. ఆగస్టు 28 తేదిన మొసలి బారిన పడిన ఓ యువతి నీటిలో గల్లంతైందని అధికారులు తెలిపారు. నీటిలో దిగే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని గ్రామస్థులకు అధికారులు హెచ్చరించారు. 
మరిన్ని వార్తలు