ఇద్దరు మహిళల ఘర్షణ; వీడియో వైరల్‌

22 Jan, 2020 15:06 IST|Sakshi

లక్నో : మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో బుధవరం ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పరస్పరం కొట్టుకున్నారు. వీరిలో ఒకరు లాయర్‌ కాగా మరోకరు స్థానిక మహిళగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి ఘర్షణ మధ్యలో మరో వ్యక్తి(లాయర్‌)  కల్పించుకొని ఇద్దరు మహిళలను చితకబాదాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గొడవలకు కారణం ఏంటనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే పాత కక్షల కారణంగానే ఈ ఘర్షణ జరగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు