మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

7 Dec, 2014 10:33 IST|Sakshi
మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. నిర్భయ ఉదంతం అనంతరం కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. శుక్రవారం రాత్రి మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.

గుర్గావ్లో ఓ ఫైనాన్స్ సంస్ధలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి విధులు ముగించుకున్నఅనంతరం స్నేహితులతో కలసి భోజనం చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఇంటికి వెళ్లడానికి ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన క్యాబ్ను అద్దెకు తీసుకున్నారు. ఇంటికి వెళుతున్న సమయంలో ఆమె కారులో నిద్రపోయారు. నిద్రలేచి చూసేసరికి నిర్మానుష ప్రదేశంలో కారు ఆగిఉంది.  డ్రైవర్ మహిళా ఉద్యోగిని బంధించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. ఆమెను ఇంటి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. ఆ సయమంలో బాధితురాలు కారు నెంబర్ ప్లేట్ను ఫోటో తీసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాబ్ కంపెనీని, నిందితుడిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు