రెండోరోజు మహిళా ఎంపీల తీవ్ర అభ్యంతరం

8 Aug, 2014 12:35 IST|Sakshi

న్యూఢిల్లీ : మహిళల వస్త్రధారణపై టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. మురళీ మోహన్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు పెద్దల సభ ప్రారంభమైన వెంటనే మురళీ మోహన్ వ్యాఖ్యలపై సభలో గందరగోళం చెలరేగింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను 15 నిమిషాలు వాయిదా పడింది.
 

>
మరిన్ని వార్తలు