లోక్‌ సభలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్రైవేటుబిల్లు

18 Nov, 2016 10:02 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ (శుక్రవారం) లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ బిజినెస్ లో 9వ ఐటమ్గా ఆ బిల్లు లిస్ట్ అయింది.

అలాగే పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హ‌మీల‌పై సభలో​ప‌ట్టుబ‌డ‌తామ‌ని, పోల‌వ‌రం,రైల్వే జోన్ స‌హా అన్ని అంశాల‌ను పార్లమెంట్‌లో లేవ‌నెత్తనున్నట్లు ఆపార్టీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు