ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంట్ ఆవరణలో మంగళవారం ఉదయం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక ధర్నా చేపట్టారు.