అట్లాంటా : పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు ఫెడరేషన్ ఆఫ్ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో వీర సైనికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ అధికారులు, అమెరికా చట్టసభలకు చెందిన అధికారులతో పాటు రిటైర్డ్ నౌకాదళ, వాయుసేన అధికారులు పాల్గొని సైనికుల సేవలను కొనియాడారు. టెర్రరిజం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించవద్దని అన్నారు.