అట్లాంటాలో వైఎస్సార్‌కు ఘన నివాళి

10 Sep, 2018 21:01 IST|Sakshi

అట్లాంటా: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సందర్భంగా అట్లాంటా వైఎస్సార్‌ సీపీ విభాగం సెప్టెంబర్‌ 8వ తేదీన ఆయనకు ఘన నివాళులు ఆర్పించారు. వైఎస్సార్‌ సీపీ అట్లాంటా ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మహానేత సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం ఉపేంద్ర రాచుపల్లి, బాలరామిరెడ్డి వల్లూరి వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ధనుంజయరెడ్డి గడ్డం డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటర్నేషనల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌ ఉద్దేశాన్ని అక్కడివారికి వివరించారు. దీనిపట్ల ఉత్సాహంగా స్పందించిన వైఎస్సార్‌ అభిమానులు ఆ ట్రస్ట్‌కు తమ మద్దతు తెలిపారు. 6 వేల డాలర్ల విరాళాలను అందజేస్తామన్నారు. ధనుంజయరెడ్డి గడ్డం, కిరణ్‌ కందుల, కృష్ణ నరసింపల్లె, జయచంద్రరెడ్డి, రాంభూపాల్‌ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఉపేంద్ర రాచుపల్లి, శ్రీని వంగిమల్ల, రాజ్‌, ప్రభాకర్‌ రెడ్డి, వేణురెడ్డి పంట, సురేశ్‌ సురువిల్ల, డా. కిశోర్‌ రెడ్డి, నవీన్‌ కొనారెడ్డి, రాజ్‌ ముప్పాల, డా. కామేశ్‌లతో పాటు పెద్ద ఎత్తున వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు